ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు మరోసారి నిరాశే ఎదురైంది

APSRTC Busses
APSRTC Busses

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది రాష్ట్ర సర్కార్. ఆగస్టు నెల కూడా మళ్లీ పాత జీతాలే ఇస్తున్నారు. ఈ మేరకు అధికారులు జీతాల బిల్లులను మంగళవారం అప్లోడ్ చేశారు. ఆగస్టు జీతాన్ని కొత్త పిఆర్సి తో చెల్లిస్తామని ఎండి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ పూర్తికాలేదని తెలిపారు.

ఆర్థిక శాఖ ఇచ్చిన సాఫ్ట్ వేర్ ప్రోగ్రాంలో జీతాల వివరాలను ఎంట్రీ చేసేందుకు ప్రయత్నించగా, అందులో చాలా వరకు తప్పులు చూపించాయి. దీంతో కొత్త పి అర్ సి జీతాలు చెల్లించడం కుదరలేదు. ఇక జూన్ 3న ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే నెల నుంచి కొత్త జీతాలు చెల్లిస్తారు అన్నారు. కానీ కొన్ని కారణాలు కుదరలేదు.