ముషీరాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిని నేనే అంటున్న అంజన్‌కుమార్ యాదవ్

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు , నాల్గు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులను ప్రకటించగా..కాంగ్రెస్ , బిజెపి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఈ క్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ మాత్రం తాను ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని వీడినా.. తాను మాత్రం పార్టీతోనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నానని వెల్లడించారు. ముషీరాబాద్ నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నారని.. అందుకే పార్టీ అధిష్ఠానం తనను బరిలోకి దించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.