సచివాలయ ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం ఆదేశం

అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధుల్లో చేరాలని సూచన

ap state logo
ap state logo

అమరావతి: ఏపిలో లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం ప్రభుత్వం వర్క్‌ ఫ్రం హోంకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వారికోసం ప్రజా రవాణా వ్యవస్థ సమకూర్చనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ సర్క్యులర్‌ జారీ చేసినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ వెల్లడించారు.

తాజా కరోనా లాక్‌ డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/