నేడు తెనాలిలో పర్యటించనున్న చంద్రబాబు
గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు తెనాలిలో పర్యటించనున్నారు. మున్సిపల్ మార్కెట్ వద్ద దీక్షా శిబిర స్థలాన్ని పరిశీలిస్తారు. వీఎస్ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో జేఏసీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని టీడీపీ నేత ఆలపాటి రాజా తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో జరగుతున్న బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి అమరావతి రాజధానిని శాశ్వతం చేసే విధంగా చాటుకోవాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/