ఎసిబి అదుపులో అచ్చెన్నాయుడు
విజయవాడ ఎసిబి కోర్టుకు తరలింపు
Srikakulam: తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈఎస్ఐ స్కామ్ లో ఆయనను ఏసీబీ ఈ ఉదయం అరెస్టుచేసింది. నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు.
అర్ధరాత్రి నిమ్మాడకు వంద మందికిపైగా పోలీసులు చేరుకున్నారు. అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి విజయవాడకు ఏసీబీ అధికారులు తరలిస్తున్నారు.
ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకలపై గతంలో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/