కంటైనర్ను ఢీకొన్న ఏపిఎస్ఆర్టిసి బస్సు
బస్సు, కంటైనర్ల డ్రైవర్ల పరిస్థితి విషమం
గుంటూరు: కంటెయినర్ను మాచర్ల ఎక్స్ప్రెస్ ఢీకొన్న ఘటన గురువారం ఉదయం కూరపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మేడికొండూరు కూరపాడు గ్రామంలో కంటెయినర్ను ఓవర్ టేకింగ్ చేస్తుండగా మాచర్ల ఎక్స్ప్రెస్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మాచర్ల ఎక్స్ప్రెస్ బస్లోని ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు డ్రైవర్, కంటైనర్ డ్రైవర్ ల పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/