శ్రీలంకలో ఏడుగురు భారతీయులు అరెస్టు
కొలంబో : వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారని మీడియా వర్గాలు తెలిపాయి. వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు తీరినప్పటికీ, అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్, ఎమ్మిగ్రేషన్ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. నెల రోజుల బిజినెస్ ట్రిప్ అని శ్రీలంకకు చేరుకుని గడువు దాటినా ఇక్కడే ఉన్న నేపథ్యంలో పాస్పోర్ట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసేవరకూ వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారని సమాచారం.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/