ఆర్మీ స్కూల్‌పై వైమానికి దాడి

airstrikes
airstrikes

ట్రిపోలి: లిబియా దేశం ట్రిపోలిలోని ఓ ఆర్మీ స్కూల్‌పై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 30 మంది విద్యార్థులు మృతి చెందగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అమీన్ అల్ హషేమీ తెలిపారు. దక్షిణా ట్రిపోలిలోని అల్ హబ్దా అల్ ఖద్రా ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై లిబియ్ ప్రెసిడెన్సియల్ కౌన్సిల్ దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించింది. ఐసిస్ తీవ్రవాదులకు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భద్రతా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/