నేపాల్లో వర్షాలు..22 మంది మృతి
44 మంది గల్లంతు
ఖాట్మండు: నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి చనిపోయిన వారిసంఖ్య 22కు చేరుకుంది. కొన్నిచోట్ల నదులవెంట ఉన్న ఇండ్లు కొట్టుకుపోయాయి. మరికొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షాలకు కొండచరియలు విరిగి నివాస స్థలాలపై పడడంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో 10 మంది గాయపడటంతో వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. . అన్ని ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 44 మంది గల్లంతైనట్లు గుర్తించామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేపాల్ అధికారులు అంచనా వేశారు. శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ముఖ్యంగా పొఖారా పట్టణానికి సమీపంలోని సారంగ్కోట్, హేమ్జాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. మ్యాగ్డీ జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/