దేశంలో 24 గంటల్లో 103 మంది మృతి
భారత్లో 24 గంటల్లో 3,390 మందికి కొత్తగా కరోనా
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,886 కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 3,390 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 56,342కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 16,539 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో 37,916 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 17, 974 కరోనా కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/