భారత్‌కు నన్ను అప్పగించొద్దు

వాషింగ్టన్‌: ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రవాద దాడి సూత్ర ధారుల్లో ఒకడైన పాక్‌ సంతతి కెనడా పౌరుడు తహవ్వుర్‌ రాణా.. తనను భారత్‌కు అప్పగించవద్దని అమెరికా కోర్టును కోరాడు. ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది పౌరుల మరణానికి కారణమైన ఈ దాడి కేసులో రాణా అప్రూవర్‌గా మారటంతో గతంలో అమెరికా కోర్టు ఆయనకు 35 ఏండ్ల జైలు శిక్ష విధించింది.