అప్ఘనిస్థాన్‌లో భూకంపం

కాబూల్‌: అప్ఘనిస్థాన్ లోని కాబుల్ నగరానికి 277 కిలోమీటర్ల దూరంలోని హిందూ కుష్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 4.01 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9 గా నమోదైందని భూగర్భ విభాగం శాస్త్రవేత్తలు వెల్లడించారు. హిందూ కుష్ ప్రాంతంలో 97 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల హిందూ కుష్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. మరోవైపు న్యూకలిడోనియాలోని వావోకు తూర్పున 415 కిలోమీటర్ల దూరంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని అమెరికా వెల్లడించింది.దీంతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని సముద్ర తీరప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.