గణేష్ మండపం వద్ద ప్రాణాలు వదిలిన యువకుడు

దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది. గత ఏడాది కరోనా కారణంగా ఇళ్లలోనే నవరాత్రుల ఉత్సవం జరుపుకోగా..ఈ ఏడాది కరోనా ఉదృతి తగ్గడం తో ఊరు , వాడ గణేష్ నవరాత్రుల ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వినాయకుడి మండపంలో అప్పటిదాకా ఎంతో సంతోషంగా డాన్సులు వేస్తూ కనిపించిన ఓ యువకుడు సడెన్ గా కుప్పకూలి చనిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం జిల్లా గుత్తిలోని గౌతమిపూరి కాలనీలో గణేష్ నవరాత్రుల సంబరాలు జరుపుకుంటున్నారు. వినాయకుడి మండపం వద్ద డాన్స్‌ చేస్తూ.. ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని హాస్పటల్ కు తరలించగా..యువకుడ్ని పరీక్షించిన డాక్టర్స్ మరణించాడని చెప్పడం తో అంత షాక్ అయ్యారు. అప్పటివరకు మానమద్యే సంతోషంగా ఉన్న యువకుడు చనిపోవడం తో కాలనీలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో మీడియా లో వైరల్ అవుతుంది.