టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బూటకం: షర్మిల

దీనిపై కెసిఆర్ చెపుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్య

ys-sharmila

హైదరాబాద్ః మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈ వ్యవహారం పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలతో ‘నాలుగు స్తంభాలాట’ అనే సినిమాను కెసిఆర్ విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఒక బూటకమని అన్నారు. ఈ అంశంపై కెసిఆర్ చెపుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని చెప్పారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కనిపించడం లేదనే విషయాన్ని పోలీసులు గమనించాలని అన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బాలకిషన్ బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష రూపాయలు కాగా… ఇప్పుడు వందల కోట్లు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/