తెలంగాణ పోలీసుల కొత్త నిఘా నేత్రం

రిమోట్‌ సెన్సింగ్‌తో ఆకాశం నుంచే నిఘా

DGP Mahender Reddy
DGP Mahender Reddy

హైదరాబాద్‌: ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో సరికొత్త చరిత్ర సృష్టించారు తెలంగాణ పోలీసులు. తాజా అంతరిక్ష పరిజ్ఞానాన్ని సొంత చేసుకని రిమోట్‌ సెన్సింగ్‌ సేవల సాయంతో నేరాలను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలు కానీ, ప్రమాదాలు కానీ ఏవి జరిగినా క్షణాల్లో డీజీపీ కార్యాలయానికి సమాచారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లిన క్షణాల్లోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుంటారు. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్, బెటాలియన్ల అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్ తో కలిసి నిన్న తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ (ట్రాక్) అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, సైంటిఫిక్ ఇంజనీర్లతో భేటీ అయ్యారు. నేరాల అదుపు, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థతో ప్రమాదాల నివారణ తదితర అంశాలపై చర్చించారు. ఇందుకోసం ట్రాక్ తో త్వరలోనే ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/