సిఎం కెసిఆర్ కూడా ఒక రైతే
స్టేట్ క్రెడిట్ సెమినార్లో మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా రైతు అని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్లో నాబార్డ్ ఆధర్వంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ 2020కి ముఖ్యఅతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, రైతుల సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని, గోదాముల నిర్మాణం, సూక్ష్మసేద్యానికి నాబార్డు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్తో రైతులకు భరోసా ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు సిజిఎం విజయ్ కుమార్, టిఎస్సిఎబి చైర్మన్ కొండూరి రవీందర్ రావు పాల్గొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/