నష్టాలతో మొదలయిన స్టాక్ మార్కెట్లు
కరోనా భయంతో మదుపర్లలో తీవ్ర ఆందోళన
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లను కోవిడ్-19 భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మదుపర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. నేటి ఉదయం 9.43 గంటలకు సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి 29,358 వద్ద.. నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 8,522 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.16 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/