దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. యుద్ధం చేయాలనే ఆలోచన తమకు లేదని అమెరికా, ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లాభాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 626 పాయింట్లు లాభపడి 41,444కి పెరిగింది. నిఫ్టీ 187 పాయింట్లు పుంజుకుని 12,213 వద్ద స్థిరపడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/