సీఎంగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం

దివ్యాంగురాలు రజని నియామక పత్రంపై రెండో సంతకం

revanth-reddy-first-two-signatures-as-cm

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆరు గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజని ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేశారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే..

.మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.
.గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
.రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్.
.యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.
.చేయూత – రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.
.ఇందిరమ్మ ఇళ్లు – ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.