రాజ్యసభ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల గడువును వారం రోజులు కుదిస్తున్నట్లు పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే పలు కీలక బిల్లులకు సభ ఆమోదం లభించింది. విపక్షాల గైర్హాజరీలోనే సభా కార్యకలాపాలు కొనసాగాయి. బుధవారం రాజ్యసభ ఆమోదించిన బిల్లుల్లో ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్2020, ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్2020, అండ్ ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ2020 బిల్లులు, జమ్ముకశ్మీర్ అధికారిక భాషల బిల్లు2020 ఉన్నాయి. అయితే అప్రాప్రియేషన్ (నెం.3) బిల్లు2020, అప్రాప్రియేషన్ (నెం.4) బిల్లు2020లను మాత్రం రాజ్యసభ తిప్పిపంపింది.
కాగా షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకు జరుగాల్సి ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/