ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను భారీగా ప్లాన్ చేస్తున్న బిజెపి

రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14 తో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ క్రమంలో ముగింపు సభను భారీగా ప్లాన్ చేస్తుంది బిజెపి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న ఈ ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించనున్నారు.

ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రానుండడంతో భారీగా ఏర్పాట్లు చేయబోతుంది. ఈ సభ కు భారీగా జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బూత్ అధ్యక్షుడు సహా ప్రతి పోలింగ్ బూత్‌కు 20 మంది చొప్పున కార్యకర్తలు జన సమీకరణ చేసే దిశగా బీజేపీ నేతలు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గానికి 5 వేల చొప్పున జన సమీకరణ చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా, మండల, రాష్ట్ర నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కనీవినీ ఎరగని రీతిలో ముగింపు సభను సక్సెస చేయాలని పిలుపునిచ్చారు. రేపటి నుండి కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ర్యాలీలు, నిరసనలు చేప్టటాలని ఆదేశించారు. దళిత బిడ్డ నాగరాజు హత్యోదంతంపైనా ఊరూవాడ నిరసన తెలపాలన్నారు.