తీన్మార్ మల్లన్న ఆఫీస్ లో మరోసారి పోలీసుల సోదాలు

క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ఆఫీసులో మరోసారి పోలీసులు సోదాలు నిర్వహించారు. వందల సంఖ్యలో మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆఫీసులోని 10 కంప్యూటర్లు, 15 హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు, పుస్తకాలు తీసుకు వెళ్లినట్లు సమాచారం. ఇక మల్లన్న ఆఫీసులో సోదాలు చేయడం ఇది మూడోసారి. ప్రస్తుతం మల్లన్న జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు.

శనివారం నుంచి మల్లన్నను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. ఈ కేసులో శుక్రవారం అంబర్ పేట శంకర్​ను కూడా పోలీసులు విచారించారు. మల్లన్న ఇటీవల కరోనా సోకినప్పుడు పీర్జాదిగూడలోనే ప్రజా క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ ఇమ్మాన్యుయేల్‌ వద్ద కరోనావైరస్‌కు చికిత్స తీసుకున్నారు. ఈ విషయంలోనూ పలు అనుమానాలు వ్యక్తంచేసిన పోలీసులు.. డాక్టర్ ఇమ్మాన్యుయేల్‌ను కూడా విచారించి అతడి నుంచి తమకు అవసరమైన సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.