సత్యేందర్ జైన్ మసాజ్ వీడియోపై మనీశ్ సిసోడియా క్లారిటీ
న్యూఢిల్లీః మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్.. మసాజ్ చేయించుకుంటున్న వీడియో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియోపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా క్లారిటీ ఇచ్చారు. సత్యేందర్ జైన్ మసాజ్ చేయించుకోలేదని, వెన్నెముక నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఫిజియోథెరపీ చేశారని చెప్పారు. అనారోగ్యానికి చికిత్స చేయించుకుంటున్న వీడియోను లీక్ చేసి బిజెపి రాజకీయం చేస్తున్నదని ఆయన విమర్శించారు. బాధితులపై కూడా క్రూరమైన జోకులు వేయగల సామర్థ్యం బిజెపికి మాత్రమే ఉన్నదని సిసోడియా వ్యాఖ్యానించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/