త్వరలో రైతు రుణమాఫీ..మంత్రి హరీష్

సిద్దిపేట: మంత్రి హరీష్ రావు సోమవారం జిల్లాలోని ములుగు కొండలక్ష్మన్ హార్టికల్చర్ యూనివర్సిటీల్లో యూనియన్ బ్యాంక్ ములుగు బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతు బంధు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంక్‌లు సహకరించాలన్నారు.

త్వరలో ఫారెస్ట్ కళాశాలని ఫారెస్ట్ యూనివర్సిటీ చేసే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలిపారు. ఫారెస్ట్ కళాశాల విద్యార్థులకు ఉపయోగపడేలా కళాశాలలో ఏటీఎం ఏర్పాటు చేయాలని అన్నారు. వాహనదారుల కోసం రోడ్డు ప్రక్కన ఏటీఎం ఏర్పాటుకు యూనివర్సిటీ వారు బ్యాంక్ వారికి సహకరించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎప్డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, యూనివర్సిటీ వీసీ నీరజ, బ్యాంక్ రీజినల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/