కరోనా వల్ల ఆక్సిజన్‌ అవసరాలు పెరిగాయి

సిద్దిపేటలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును ప్రారంభించిన మంత్రి హరీశ్

minister-harish-rao-inaugurated-the-liquid-oxygen-tank in siddipet

సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అవసరాలు పెరిగాయి. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు రావాలంటే.. వైద్య సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని గమనించి శాశ్వత ప్రాతిపదికన సిద్దిపేట మెడికల్ కళాశాలకు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించినట్లు పేర్కొన్నారు. 24/7 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 405 బెడ్స్ కోసం పని చేసేలా రూ.61 లక్షల వ్యయంతో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించినట్లు మంత్రి తెలిపారు.

ప్రజలు అనవసరంగా ప్రైవేట్ దవాఖానకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి కోరారు. సిద్దిపేటలో వంద పడకల కొవిడ్ దవాఖాన, మంచి డాక్టర్లు ఉన్నారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే సిద్దిపేట కొవిడ్ దవాఖానకు రావాలి. ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం సిద్ధంగా ఉందని హరీశ్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ చంద్రయ్య, మెడికల్ కళాశాల ఆర్ఏంవో కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/