ముంబైలో భారీ అగ్నిప్రమాదం..

ముంబైలోని గుర్‌గావ్‌ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 14 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఇందులో ఆరు కార్లు, ఏడు బైకులు, ఓ స్కూటర్‌, ఆటో ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు.

అయితే రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఫైర్‌ఇంజిన్లు రావడానికి ఆలస్య మయిందని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆ గోదామ్‌ను చాలా కాలం క్రితమే మూసివేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారాలు ఇంకా తెలియరాలే. అయితే పటాకులు పేల్చడం వల్లే మంటలు అంటుకున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.