పుంజుకున్న స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తేరుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్లు లాభపడి 69,826కి చేరుకుంది. నిఫ్టీ 68 పాయింట్లు పుంజుకుని 20,969 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.38 వద్ద కొనసాగుతుంది.