లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్లు లాభపడి 65,982కి చేరుకుంది. నిఫ్టీ 90 పరుగులు పుంజుకుని 19,765 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.23 వద్ద కొనసాగుతుంది.