మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు నష్టపోయి 60,682కి పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 17,856 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.58 వద్ద కొనసాగుతుంది.