కొత్త సంవత్సరానికి లాభాలతో స్వాగతం

ముంబయి: కొత్త సంవత్సరం తొలి ట్రేడింగ్ సెషన్ ను దేశీయ స్టాక్ మార్కెట్లు ఘనంగా ప్రారంభించాయి. ఈరోజు మార్కెట్లు దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 929 పాయింట్లు లాభపడి 59,183కి చేరుకుంది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,626 వద్ద స్థిరపడింది.డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద కొనసాగుతుంది

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/