వన్యప్రాణులకు ఒకింత స్వేచ్ఛ

సామాజిక మాధ్యమంలో వైరల్

Tigers
Tigers

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని యావత్మల్ సమీపంలో ఉన్న తిపేశ్వర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక పెద్దపులి తన కూనలతో రోడ్డు దాటుతున్న దృశ్యం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. 

కరోనా కట్టడికోసం దేశవ్యాప్తంగా  లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్ల మీద జనసంచారం, వాహనాల రాకపోకలు దాదాపు కరువైన నేపథ్యంలొ వన్యప్రాణులకు ఒకింత స్వేచ్ఛ దొరికినట్లైంది.

దీంతో సహజసిద్ద స్వభావిక లక్షణాలను, స్వేచ్ఛను అవి ఇప్పుడు యధేచ్ఛగా  ప్రదర్శిస్తున్నాయని వన్యప్రాణి సంక్షేమ కార్యకర్తలు అంటున్నారు.

తెలంగాణాలోని కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఉన్న పులులు కూడా స్వేచ్ఛగా రోడ్లు దాటుతూ కనిపిస్తున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/