జెడియు నుంచి ఉద్వాసన
Patna: జనతాదళ్ యునైటెడ్ (జెడియు)నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ను, పవన్ వర్మను బహిష్కరించారు. వారిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా వారిని బహిష్కరించారు. సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సిఎఎ)పై పార్టీ వైఖరిని వారు తప్పుపడుతున్నారు. తనను బహిష్కరించనందుకు జెడియు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/