అమెరికాలో వెయ్యి మంది సైనికులకు కరోనా
తాజా సర్వే వెల్లడి
కరోనా ప్రభావానికి అగ్రరాజ్యం అమెరికా పిల్లికూనలా గజగజలాడిపోతున్నది.
కరోనా పంజా సైన్యంపై కూడా విసిరినట్లు తాజాగా తేలింది. అమెరికాలో దాదాపు వెయ్యి మంది సైనికులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
303 మంది నేషనల్ గార్డ్స్, ఓ విమాన వాహన నౌకలో ఉన్న 150 మంది సైనికులు వైరస్ బారిన పడ్డారు. వైరస్ నియంత్రణ కోసం సైన్యం రంగంలోకి దిగింది.
ఈ నేపథ్యంలోనే సైనికులకు కరోనా వైరస్ సోకిందని భావిస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/