ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరం
ఢిల్లీ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసా ఘటనలపై టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సేహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటం దురదృష్టకరమని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఇలాంటి ఘటనలు జరగడం ఎంతో దురదృష్టకరం. ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఢిల్లీలో ఎవరికి గాయమైనా అది ఎంతో గొప్ప దేశమైన భారతదేశపు రాజధానికే మచ్చ. ప్రతి ఒక్కరూ శాంతి స్థాపనకు కృషి చేయాలని సేహ్వాగ్ కోరాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/