కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి గైర్హాజరు

కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఢిల్లీలోని ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కాగా ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు కేబినెట్ కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది.

కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నిన్న నియమించిన సంగతి తెలిసిందే. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీజేపీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏక కాలంలో రెండు పదవులను నిర్వహించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి ఆయన ప్రచారం చేసినట్టు చెపుతున్నారు. ఈ సాయంత్రానికి మరికొందరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క రాష్ట్ర నూతన అధ్యక్షుడుగా ప్రకటన తరువాత కిషన్ రెడ్డి స్పందించలేదు.ఈ క్రమంలో నియామకం విషయంలో పార్టీ అధిష్టానంపై కిషన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.