మంత్రి రోజా ఇంటి ముందు జనసేన పార్టీ నాయకులు తొడగొట్టారు

ఏపీలో జనసేన vs వైస్సార్సీపీ వార్ నడుస్తుంది. జనసేన నేతలు ఎక్కడ కూడా తగ్గిదేలే అంటున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంత్రి రోజాపై కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు చేశామని నగరి పోలీసులు తెలిపారు. అయితే, కిరణ్‌ రాయల్‌ను నగరి కోర్టులో హాజరు పరచగా.. 41ఏ నోటీసు ఇచ్చి ఆయన్ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో కిరణ్ రాయల్ బెయిల్‌పై విడుదలైన తర్వాత నగరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఓవైపు వర్షం కురుస్తున్నా.. ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత మంత్రి రోజా ఇంటి సమీపంలో జనసేన నాయకులు కాసేపు ఆగి తొడకొట్టారు. తొడగొట్టిన వారిలో కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, ఓ మహిళతో పాటు ఇతర జనసేన నేతలు ఉన్నారు. ప్రస్తుతం దీని తాలూకా వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ లో పర్యటిస్తున్నారు. నిన్న మోడీ ని కలిసిన పవన్..శనివారం సాయంత్రం ఆలా విశాఖ బీచ్ లో సందడి చేసారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి బీచ్ లో వాక్ చేసారు. అనంతరం రుషికొండ తవ్వకాలను పరిశీలించారు.