3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

Rohit Sharma and KL Rahul
Rohit Sharma and KL Rahul

హామిల్టన్‌: భారత్‌-కివీస్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరుగుతుంది. టీమిండియా 12 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. మొదటగా భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ క్రీజులోకి దిగారు. రోహిత్‌ శర్మ 40 బంతుల్లో 64 (6’4, 3’6) పరుగులు చేశాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ 19 బంతుల్లో 27(2’4, 1’6) పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్‌ దూబే(3 పరుగులు) కాస్త నిరాశ పరిచాడు. ప్రస్తుతానికి టీమిండియా నిలకడగానే ఆడుతుంది. క్రీజులో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/