జంటనగరాల్లో భారీ వర్షం
ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం
Hyderabad: ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మాదాపూర్, కొండాపూర్, అమీర్పేట, సోమాజిగూడ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా సాయంత్రం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వేగం గా గాలులు వీచాయి. మరోవైపు భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు రోడ్లలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/