క్యాన్సర్ బారినపడిన ప్రభాస్ హీరోయిన్..

చిత్రసీమకు చెందిన నటి , నటులు ఎక్కువ సంఖ్య లో క్యాన్సర్ బారినపడుతుంటారు. కొంతమంది క్షేమంగా బయటపడ్డ..చాలామంది మరణించారు. ఈ మధ్యనే బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే క్యాన్సర్ నుండి క్షేమంగా బయటపడింది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కాన్సర్ బారినపడినట్లు తెలుస్తుంది.

ప్రభాస్ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ పలువురిని షాక్ కు గురిచేస్తోంది. తనకు క్యాన్సర్ అంటూ గుండుతో వున్న ఫొటోని షేర్ చేసి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు హంసా నందిని. ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంలో మిర్చి మిర్చి లాంటి కుర్రాడే అంటూ ప్రత్యేక గీతంలో మెరిసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హంసా నందిని తనకు క్యాన్సర్ సోకిందని తాను రొమ్ము క్యాన్సర్ గ్రేడ్ -3 తో బాధపడుతున్నానని సోషల్ మీడయా వేదికగా వెల్లించింది.

అంతే కాకుండా చికిత్సలో భాగంగా తాను కీమో థెరపీ చేయించుకుంటున్నానని వెల్లడించింది. దాని కారణంగానే తన జుట్టుని కోల్పోయానని తెలుపుతూ హంసా నందిని పెట్టిన పోస్ట్ ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్టుగా నాలుగు నెలల క్రితమే గుర్తించానని అనుమానం రావడంతో వెళ్లి పరీక్షలు చేయించుకున్నానని.. కొన్ని టెస్ట్ ల అనంతరం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వున్నట్టుగా తేలిందని హంసా నందిని తన పోస్ట్ లో స్పష్టం చేసింది. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ కారణంగానే తన తల్లి మృతి చెందిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న హంసా నందిని భావోద్వేగానికి లోనైంది.