ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికత విద్య
క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
Tadepalli: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్ డిస్ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీల ఉపకరణాలను సీఎం పరిశీలించారు.
విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ, ఏపీ స్కూల్ ఎఢ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కార్యదర్శి ఏ సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/