మైనర్ బాలిక రేప్ కేసు ఫై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి ఎమ్మెల్యే రఘునందన్

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ పబ్ బాలిక అత్యాచార ఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఇంతలా మాట్లాడుకోవడానికి కారణం..ఈ అత్యాచార ఘటన వెనుక రాజకీయనేతల కొడుకులు ఉండడమే. వారిని తప్పించి , అమాయకుపు యువకులను ఈ కేసులో ఇరికించాలని ప్రభుత్వం చూస్తుందని ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. ఇప్పటికే పలు పార్టీలు పోలీస్ స్టేషన్ లను ముట్టడికి యత్నించగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు ఫొటోస్, వీడియోస్ బట్టబయలు చేసారు. ఈ వీడియో లో నిందితులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసులు వారిని పట్టుకోకపోవడం ఫై విమర్శలు ఎదురవుతున్నాయి.

గ్యాంగ్ రేప్ చేసిన వారిని ఎందుకు సీక్రెట్ గా దాస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ పోలీసులను డిమాండ్ చేసారు. నిర్భయ కేసులో మైనర్ల పేర్లు బయటకు వస్తున్నాయి..మరి నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులు నిందుతులను బహిరంగంగా అరెస్టు చేసినట్లు ఎక్కడా రాలేదు. ఎందుకు వారిని సీక్రెట్ గా ఉంచుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లును రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంను ఎందుకు చేయరు అని అన్నారు. రెడ్ కలర్ మెర్సిడెస్ బెజ్ కారులో ఈ ఘటన జరిగింది. కానీ పోలీసులు ఇన్నొవాలో ఉన్నవారి అరెస్టు చేశారు. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, మరో ఉన్నత స్థాయి మనవడు ఉన్నారు..రెడ్ కల్లర్ బెంజ్ కారులో ఏం జరిగిందో మా దగ్గర వీడియోలు ఉన్నాయన్నారు. ఈ కేసులో దోషులను అరెస్టు చేసి శిక్ష విధించేదాక పోరాడుతామని రఘునందన్ డిమాండ్ చేశారు. అంతే కాదు పలు పిక్స్ , వీడియోలను బయటకు రిలీజ్ చేసారు రఘునందన్.