సీఎం జగన్ను కలిసిన కొత్త డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్
ఆయనకు జగన్ శుభాకాంక్షలు

అమరావతి : ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ విభాగం డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ను కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 1992∙బ్యాచ్కు చెందిన రాజేంద్రనాథ్రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. కాగా, గౌతమ్ సవాంగ్ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/