నేడు కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రెండో రోజు

chandrababu naidu
chandrababu naidu

కప్పం: టిడిపి అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటన ఈరోజు కొనసాగనుంది.ప్రజాచైతన్య యాత్రలో భాగంగా దండికుప్పం, కంగుంది, గోవినపల్లె, విజలాపురంలో ఆయన పర్యటించనున్నారు. శాంతిపురం ఎంపీడీవో కార్యాలయంలో మీడియాతో సమావేశమవుతారు. తర్వాత స్థానిక బాలాజీ కల్యాణమండపంలో జరిగే శాంతిపురం మండల టీడీపీ నేతల సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, ఈరోజు రాత్రికి కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో చంద్రబాబు బస చేస్తారని, రేపు ఉదయం బెంగళూరుకు వెళతారని పార్టీ వర్గాల సమాచారం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/