బిఆర్‌ఎస్‌కి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా!

21-councillor-resign-to-brs-in-bellampalli

హైదరాబాద్‌ః బెల్లంపల్లి లో 21 మంది కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌ కి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం కలకలం రేపుతోంది. అయితే 19 మంది సంతకాలు చేసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ కి రాజీనామా లేఖ ని పంపించారట సంతకాలు చేయనప్పటికీ వైస్ చైర్మన్ సుదర్శన్ తో పాటు 14వ వార్డు కౌన్సిలర్ బొడ్డు నారాయణ సైతం రాజీనామా కి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, వారం క్రితం బిఆర్‌ఎస్‌ చెందిన 18 మంది కౌన్సిలర్లు బస్సు లో శిబిరానికి తరలి వెళ్లారు. అప్పటినుండి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టించుకోవట్లేదు అని ఆరోపించారు. వాళ్ళందరూ కూడా రాజీనామా నిర్ణయానికి వచ్చారు శుక్రవారం అవిశ్వాస తీర్మానం పై సమావేశం జరగాలి. బెల్లంపల్లి లో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. వీళ్లల్లో ఒక వార్డ్ కౌన్సిలర్ గతంలో మృతి చెందారు ప్రస్తుతం కాంగ్రెస్ కి 11 మంది, బిజెపికి ఒకరు సపోర్ట్ ఇస్తున్నారు. బిఆర్‌ఎస్‌కు చందు 21 మంది రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.