రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘనస్వాగతం
విచ్చేసిన సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
Tirupati: రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. తొలుత సిఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలికారు. కాగా చితూరుజిల్లాలో రామ్నాద్కోవింద్ ఇవాళ పర్యటించనున్న విషయం తెలిసిందే..
మరికాసేపట్లో రాష్ట్రపతి మదనపల్లెకు చేరుకుంటున్నారు. అక్కడి సమీపంలోని సత్సంగ్ ఫౌండేషన్ వద్దకు చేరుకుని భారత్ యోగా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు.