తెలంగాణలో మే 7 వరకూ లాక్ డౌన్
కేబినేట్ నిర్ణయం
Hyderabad: తెలంగాణలో మే 7 వరకూ లాక్ డౌన్ ను పొడగించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తప్పవని నిర్ణయించింది.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీని కూడా నిషేధించాలని నిర్ణయించింది.
ఇళ్ల కిరాయిలను మూడు నెలల పాటు వసూలు చేయకుండా ఉండే విధంగా గృహ యజమానులను ఆదేశించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/