ఆకాశమంతా ‘ఆమె’దే
మహిళ శక్తి.. ఎంత చెప్పుకున్నా తక్కువే
ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం కూడా లింగ సమానత్వాన్ని సాధించలేదని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. ఇంటి పనుల్ని చక్క బెట్టడంలో, పనిచేసే ప్రదేశాల్లో, ఒకే పనికి వచ్చే వేతనాల్లో, చదువులో, ఆరోగ్యంలో ఇలా అన్నింటా ఇంకా ఆమె చేరుకోవాల్సిన లక్ష్యాలు భారీగానే ఉన్నాయి. ఆకాశమంతా ‘ఆమె’దే. మహిళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
కుటుంబంలో ఆమె ఒక దీపం. తాను కరిగిపోతున్నా ఇంట్లోవారందరికి వెలుగునిస్తూనే ఉంటుంది. అయినా ఆ దీపం కాంతి చెదరిపోదు, వెలుగునిస్తున్నా అలసిపోనిది.
నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సమస్య వస్తే బెదరిపోదు. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తుంది. బాధలు, కన్నీలు వస్తున్నా దాన్ని తనలోనే దాచుకుంటుంది.
కుటుంబ పరవ్ఞకోసం, ప్రతిష్ట కోసం తనలోతాను కాలిపోతున్నా ఆ బాధను వ్యక్తం చేయదు. అమ్మ పనికి జీతం లేదు. అలాగని ఆమె పనిని వెలకట్టి ఇవ్వలేనిది.
కోట్లాదిరూపాయలు అమ్మకు ఇదో నీ పనికి ఇదే జీతమని కొలచి ఇవ్వలేనిది. ఆమె ప్రేమ ముందు ఆ డబ్బు విలువలేనిదిగా మారిపోతుంది. ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య వీటన్నింటికి మించి ఒక పోరాట యోధురాలు. శక్తియుక్తులు కలిగిన నారీమణి. అతని వెంట ఆమెకాదు.. అన్నింటా ఆమే.
అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. అవకాయ పెట్టడం నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు..అగ్గిపెట్టెల తయారీ దగ్గర్నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా ఆమె ఉనికి కనిపిస్తోంది. ఆమె ఆకాశంలో సగం కాదు ఇప్పుడు ఆమే ఆకాశం.
ఇంటెడు చాకిరీచేసే అమ్మకి కూడా రిలాక్సేషన్ కావాలి. అమ్మ ఆనందంగా ఉంచడానికి నీలకౌశిక గుర్గావ్మామ్స్ సంస్థని స్థాపించారు. చెన్నైకి చెందిన ఆమె కొన్నాళ్లు భర్తతో కలిసి అమెరికాలో ఉన్నారు. తర్వాత సొంతూరు గుర్గావ్కి వచ్చేశారు. డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తూ 2012లో అమ్మలందరినీ ఒక చోటకి చేర్చేపని ప్రారంభించారు.
30వేల మందికిపైగా అమ్మలు సభ్యులయ్యా రు. రాత్రిపూట ఔటింగ్కు తీసుకెళ్లడం, వాళ్లలో అంతర్లీనంగా ఉన్నకళల్ని వెలికితీయడం, వాళ్లు తయారుచేసే వస్తువులకి బ్రాండింగ్ కల్పించి సోషల్ మీడియా ద్వారా విక్రయించడం వంటివి కౌశిక్నేతృత్వంలో జరుగుతోంది. వీళ్లంతా ఎప్పుడు వీలైతే అప్పుడు కలుస్తుంటారు. అనుభూతుల్ని కల బోసు కుంటారు.
తమ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గాలను అన్వేషిస్తారు. అందుకే మహిళలకంటూ ఒకరోజు ఎందుకో తనకు అర్ధంకాదని అంటారు కౌశిక్. నిజమేకదా ప్రతీరోజు మహిళలదే అయినప్పుడు వారికంటూ ప్రత్యేకంగా రోజెందుకు?
బుల్ధానా అధికారుల్లో ఆదర్శనీయమైన ఆలోచన..
ఉద్యోగం కావాలంటే అనుభవం ఉందా అని అడుగుతారు. ఎవరైనా అవకాశం ఇస్తే కదా అనుభవం వచ్చేది ప్రతిభ బయటకొచ్చేది! మహారాష్ట్ర బుల్ధానా జిల్లా యంత్రాంగం అమ్మాయిలకి అలాంటి అవకాశం వచ్చేలా వినూత్న ఆలోచన చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరికల్లాంటి అమ్మాయిలను ఎంపిక చేసి వారికి ఒక్కరోజు కలెక్టర్ బాధ్యతలు అప్పగిస్తారు.
జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు, జిల్లా అభివృద్ధికి రచించాల్సిన ప్రణాళికలు వంటివి ఒక్కరోజు ఆ కలెక్టర్ పదవిలో ఉండే అమ్మాయి ప్రభుత్వానికి వివరించే మహత్తర అవకాశం వస్తుంది. ఇదంతా చదువుతుంటే ఒక్కరోజు సిఎం పదవిపై వచ్చిన సినిమా వస్తోందా? అది సినిమా కాబట్టి ఒకే.
కానీ రయల్లైఫ్లో అది సాధ్యమేనా అనుకోవద్దు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధ్య. ఆ 24 గంటల సమయంలోనే ఎన్నో చేయొచ్చు. సమాజాన్ని మార్చే వినూత్న ఆలోచన మెదడులో పుట్టడానికి క్షణం చాలు. దానిని అమలుచేసే అవకాశం రావడమే అరుదు. అలాంటి అరుదైన అవకాశం బుల్ధానా అమ్మాయిల్లో ఒకరికి వస్తోంది.
ఇలా ఒక్కరోజు ఆ కుర్చీలో కూర్చుంటే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు, ఇంకా బాగా పని చేయాలన్న ప్రేరణ కూడా వస్తుంది.
ప్రభుత్వ య్తంఆంగం ఎలా పనిచేస్తుందో సామాజిక, ఇతర అంశాలను ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్గా తెలిస్తే, ఐఎఎస్ కావాలన్న స్ఫూర్తి కూడా వారిలో రగులుతుందని బుల్ధానా కలెక్టర్ సుమన్చంద్ర అభిప్రాయపడ్డారు. అమ్మాయిలంటే పింక్, అబ్బాయిలంటే బ్లూ కానీ ఇటీవల ముగిసిన మహిళా దినోత్సవంలో ఒక కొత్త రంగు కనిపిస్తోంది.
అదే పర్పుల్. ఈమధ్య ఏ పార్టీలు జరిగినా వేసుకునే డ్రెస్సుల్లో కలర్ కోడ్ పాటిస్తున్నారు. ఈసారి ఐక్యరాజ్యసమితి ఇటీవలే జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ పర్పుల్ రంగు దుస్తులు ధరించాలని పిలుపునిచ్చింది. ఈ రంగు ఎంచుకోవడానికి ఓకారణముంది. ఆగ, మగ ఇద్దరూ సమానమేనని మాటల్లోనే చెబుతాం.
ఆచరణలోకి ఇంకా అది రావడం లేదు. 2020లోకి వచ్చినా ఈ భావన ఇంకా పోలేదు. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం కూడా లింగ సమానత్వాన్ని సాధించలేదని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతోంది.
ఇంటి పనుల్ని చక్క బెట్టడంలో, పనిచేసే ప్రదేశాల్లో, ఒకే పనికి వచ్చే వేతనాల్లో, చదవులో, ఆరోగ్యంలో ఇలా అన్నింటా ఇంకా ఆమె చేరుకోవాల్సిన లక్ష్యాలు భారీగానే ఉన్నాయి.
అందుకే మహిళలు తమ హక్కుల్ని తెలుసుకొని అన్నింటా సమానత్వాన్ని సాధించే లక్ష్యంతో ఉమెన్స్డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సమానత్వం అనే భావనకు ఉదారంగు ప్రతీకగా నిలుస్తుంది. మన రంగులకీ ఒక శాస్త్రం ఉంది. నిజాయితీ, లక్ష్యసాధనలో స్థిరత్వం, ఒక ప్రయోజనం నెరవేర్చుకోవడంలో దృఢనిశ్చయం వంటి వాటికి పర్సుల్ రంగు సంకేతం. మహిళా స్వేచ్ఛా ఉద్యమం థీమ్ కలర్ఊదాయే. మరెందుకాలస్యం..పర్పుల్ రంగు దుస్తులు వేసుకోండి.
మీరనుకున్న ప్రయోజనాన్ని నెరవేర్చుకోండి. సూపర్మ్యాన్, బ్యాట్మ్యాన్, స్పైడర్మ్యాన్..ఇలా ఏది చూసినా మగవారిని హీరోలుగా చేసి చూపించేపాత్రలే. కానీ మహిళలకేం తక్కువ?వారి శక్తి సామర్థ్యాలు మగవాళ్లకి ఏ విధంగానూ తీసిపోవని శాస్త్రీయంగా రుజువైంది.
దీర్ఘాయుష్మాన్భవ అని పెద్దవాళ్లు దీవిస్తారు కదా!ఆ దీవెనలన్నీ ఆడవారికే దక్కినట్టుగా అనిపిస్తోంది. 110 ఏళ్లకంటే ఎక్కువ జీవితాన్ని చూసిన 43 మందిలో 42మంది మహిళలే ఉన్నారనే గ్లోబల్ గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది.
శరీరనిర్మాణం, సామాజికపరమైన అంశాలు, వ్యవసనాలు లేకపోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు ఆడవారిలో ఆయుష్షును పెంచుతున్నాయి. మగవారితో పోలిస్తే ఆడవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువట. కరవు కాటకాలు, వాతావరణ మార్పులు, వ్యాధులు ప్రబలినప్పుడు మహిళలే ఎక్కువగా తట్టుకోగలరని అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ అధ్యయనకారులు చెబుతున్నారు.
దీనికి స్పష్టమైన కారణాలు సరిగ్గా వెల్లడికానప్పటికీ తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా స్వీకరించుకోగలిగే శక్తివారికి వస్తుందని చెబుతున్నారు.
మానసికంగా మహిళలే ఎక్కువగా బలవంతులని సెయింట్ గాలెన్ యూనివర్సిటీ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. మగవారి కంటే మహిళలే అత్యధికంగా ఒత్తిళ్లను తట్టుకోగలరట. మగవారి
మెదడు సైజు పెద్దదేమో కానీ, సొంత తెలివి మాత్రం ఆడవాళ్లదేనట.
ఎడిన్బర్గ్ యూనివర్సిటీ నిర్వహించిన ఐక్యూపరీక్షల్లో మహిళలు స్పందించినంత చురుగ్గా మగవారు స్పందించలేరని తేలింది. సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ఏం జరిగినా ఫొటోలుదిగడం, వాటిని షేర చేయడం సర్వసాధారణమైంది. ఒకప్పుడు గర్బిణులు బయటకి రావడానికి కూడా కాస్త బిడియపడేవారు. అందులోనూ సెలబ్రిటీలైతే కెమెరలకు దూరంగా ఉండేవారు. గర్భం దాల్చినప్పుడు పెరిగే పొట్ట, భారీ శరీరంతో గ్లామరస్ గా కనిపించేమేమోనన్న సందేహాలు ఉండేవి.
కానీ ఇప్డుడు ఆ ట్రెండ్మా రింది. గర్భం దాల్చినప్పుడు మహిళల్లో కనిపించే ఆ నిండుదనం లో ఒక అందం కూడా ఉంఉంటుందని గ్రహించిన బాలీవుడ్ తీసుకొని ఆయూష్ కేజ్రీవాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ గర్భం దాలిస్తే ఆడవారిని మోడలింగ్కు దూరంగా ఉంచిఎందుకు వివక్ష చూపించాలని భావించారు.
వెంటనే ఓ గర్భిణీతో కలంకాని చీరలకు మోడలింగ్చేయించి, ఆ ఫొటోలను ఇన్స్టాగ్రా మ్లో ఉంచారు. ఇలా ప్రెగ్నెంట్స్గా ఉన్నప్పటికీ మోడలింగ్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్ అనేచెప్పాలి.
గర్భిణులు వారికి ఇష్టమైతే పని చేస్తారు. లేదంటే బ్రేక్ తీసుకుంటారు. అలా పనిచేసే పరిస్థితి లేకపోవడం అంటే వారి స్వేచ్ఛను హరించడమే. అలాకాకుండా అమ్మత నాన్ని కూడా నిండుగా చూపించడమనే ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలైంది. మున్ముందు ఇది మరింతగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అతిథ్య మర్యాదల్లో మన మహిళామణులది అందెవేసిన చెయ్యి. ఇంటికి ఎవరైనా అతిథులొస్తే వారికి చిన్నపాటి కష్టం కలగకుండా సర్వం అమర్చిపెట్టే సహనం ఉన్న వారు. ఆ ఆతిథ్యమే ఇప్పుడు వారికి ఆర్థిక స్వావలంబనకి బాటలు వేసింది.
ఎయిర్ బీఎన్బి అంటే తెలుసా? ఆతిథ్య రంగంలోపేరొందిన అంతర్జాతీయ ఆన్లైన్ ప్లాట్ఫాం. ప్రపంచదేశాల్లో మనం ఎక్కడికి వెళ్లి ఉండాలన్నా పుల్ ఫర్నిచర్తో ఉన్న ఇళ్లు, సకల సౌకర్యాలతో బసకల్పించే ప్లాట్ఫాం ఇది.
ఊళ్లుపట్టుకొని తిరిగే వారికి దీనిద్వారా బస ఏర్పాటు చేసుకోవడం సులభం. మహిళలు అతిథ్యమిచ్చే ఎయిర్బిఎన్బి ద్వారా గతేడాది భారత్లో మహిళలు రూ.100 కోట్లకు పైగా సంపాదించారు.
గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, జైపూర్లలో ఎయిర్ బిఎన్బి వినియోగదారులు ఎక్కువ. భారతీయ మహిళల్లో 34 శాతం మంది దీని ద్వారా అతిథ్యమిస్తే, 40శాతం మంది అతిథులుగా వెళ్లి ఎంజాయ్ చేశారు.
ఇక ఎయిర బిఎన్బి ద్వారా అతిథ్యమిచ్చి ప్రపంచ వ్యాప్తంగా మహిళలు 14,900 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించారు. ఇలా మహిళలకి ఆర్థిక స్వేచ్ఛ రావడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా నిలుస్తుందని ఎయిర్ బిఎన్బి ఇండియా కంట్రీ మేనేజర్ అమన్ప్రీత్ సింగ్ బజాజ్ అంటున్నారు.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation