మణిపూర్ ఘటన చాలా బాధాకరం : మాజీ సీజేఐ గగోయ్
న్యూఢిల్లీ: మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనపై మాజీ సీజేఐ, రాజ్యసభ ఎంపీ రంజన్ గగోయ్ స్పందించారు. ఆ ఘటన చాలా బాధాకరమని, అది దురదృష్టకర సంఘటన అని ఆయన అన్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఇవాళ ఆయన పార్లమెంట్కు వచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ఘటనపై కామెంట్ చేయాల్సింది ఏమీలేదన్నారు.
మరోవైపు జాతీయ మహిళా కమీషన్ కూడా మణిపూర్ ఘటనను ఖండించింది. నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు చెప్పింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మణిపూర్ డీజీపీని కోరినట్లు జాతీయ మహిళా కమిషన్ పేర్కొన్నది. ఈ ఘటనకు చెందిన ఓ ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారని ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు మరికొందర్ని అదుపులోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. ట్విట్టర్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చామని, ఇలాంటి వీడియోలను ఆపేయాలని సూచించామన్నారు.