రేపు ఎన్నిక‌ల సంఘంతో స‌చిన్ టెండూల్క‌ర్‌ ఒప్పందం

నేష‌న‌ల్ ఐకాన్‌గా స‌చిన్ టెండూల్క‌ర్‌

sachin tendulkar
sachin tendulkar

న్యూఢిల్లీ:ఎన్నిక‌ల సంఘం లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ తో ఒప్పందం కుదుర్చుకోనున్న‌ది. ఎన్నిక‌లపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు స‌చిన్‌ను నేష‌న‌ల్ ఐకాన్‌గా ఈసీ నియ‌మించ‌నున్న‌ది. బుధ‌వారం దీనిపై ఒప్పందం కుద‌ర‌నున్న‌ది. రాబోయే ఎన్నిక‌ల్లో యువ‌తకు ఓటింగ్‌పై అవగాహ‌న క‌ల్పించేందుకు స‌చిన్ ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌లే టార్గెట్‌గా స‌చిన్ ఓట‌ర్ల చైత‌న్య ప్ర‌చారం నిర్వ‌హిస్తార‌ని ఈసీ తెలిపింది. అనేక రంగాల‌కు చెందిన మేటి వ్య‌క్తుల్ని నేష‌న‌ల్ ఐకాన్స్‌గా ఈసీ త‌మ ప్ర‌చారం కోసం నియ‌మించుకుంటోంది. గ‌తంలో పంక‌జ్ త్రిపాఠి, ఎంఎస్ ధోనీ, ఆమిర్ ఖాన్‌, మేరీ కోమ్‌ల‌ను కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఈసీ వాడుకున్న విష‌యం తెలిసిందే.