2024 ఎన్నికల్లో వైస్సార్సీపీ కి 17 సీట్లు కూడా కష్టమే – కొండ్రు మురళి

2024 ఎన్నికల్లో వైస్సార్సీపీ కి 17 సీట్లు కూడా కష్టమే అని కీలక వ్యాఖ్యలు చేసారు మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొండ్రు మురళి. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పరిత్యాలు వ్యూహాలు , ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలకు ఇప్పటి నుండే దగ్గరయ్యేందుకు యాత్రలు మొదలుపెట్టారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయడంకా మోగిస్తామని వైస్సార్సీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే..వైస్సార్సీపీ కి 17 సీట్లు కూడా కష్టమే అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొండ్రు మురళి అన్నారు.

విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..జగన్ వెనకాల ఉన్న నాయకులు గడ్డి తినడానికే పనికొస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని , రానున్న ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెబుతారన్నారు. మద్యం అమ్మకాల్లోనూ అవినీతి జరుగుతుందని.. సొంత బ్రాండ్లతో రోజుకి రూ.250 కోట్లు దోచుకుంటున్నారని మురళి ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ కి17 సీట్లు కూడా రావని అన్నారు. చంద్రబాబు నాయుడు యూనివర్సల్ నాయకుడని.. జగన్ గల్లీ నాయకుడంటూ కామెంట్స్ చేశారు.